కోవిడ్ నుంచి మంత్రి హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆంకాక్షిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షిస్తున్నాను.
I wish speedy recovery of Telangana State Finance Minister Shri T. Harish Rao garu @trsharish @PIBHyderabad @IPRTelangana @DDYadagiri @airnews_hyd— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 6, 2020
వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షచేయించుకోగా పాజిటివ్గా తేలిందని మంత్రి హరీష్రావు స్వయంగా శనివారం తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్స పొందుతున్నారు. ‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను వైరస్ నిర్ధారణ పరీక్షచేయించుకున్నాను. పాజిటివ్గా నివేదిక వచ్చింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవాళ్లు ఐసొలేషన్లో ఉండి, కరోనా టెస్ట్ చేయించుకోండి. ఎవరూ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకండి. నా హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను’ అని మంత్రి హరీశ్రావు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.