AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌కు మరో ఛాన్స్

గతంలో ఎంసెట్‌ కౌన్సిలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌కు మరో ఛాన్స్
Balaraju Goud
|

Updated on: Oct 30, 2020 | 7:29 AM

Share

గతంలో ఎంసెట్‌ కౌన్సిలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. నవంబర్ 1న ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 31న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రవేశాల కమిటీ చైర్మన్, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శుక్రవారం నుంచి నవంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 4న ఇంజినీరింగ్ అర్హత సాధించిన విద్యార్థులకు తుది విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్ల కేటాంయించిన విద్యార్థలు నవంబర్ 4 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు విద్యార్థులు కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది. తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ బుధవారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా పడింది. ఓపెన్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు 35 మార్కులనే ప్రవేశ పరీక్షలకు అర్హతగా పరిగణించాలని పేర్కొంటూ గురువారం ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా సవరించిన షెడ్యూలు విడుదల చేశారు. ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ పేర్కొంది.