బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

| Edited By:

Aug 25, 2020 | 11:39 AM

బిగ్‌బాస్ సీజన్-4 షోలో ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ ఇచ్చాడు. తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నందు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. బిగ్‌బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి..

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ
Follow us on

బిగ్‌బాస్ సీజన్-4 షోలో ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ ఇచ్చాడు. తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నందు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. బిగ్‌బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు మద్దతు ఇవ్వాలని నందు అభిమానులను కోరాడు. ఇక బిగ్‌బాస్-4 షో పోటీదారుల జాబితా గురించి చాలా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో నందు పేరు కూడా గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ నందు తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో.. ”డార్లింగ్ నేను బిబిలో వస్తున్నా.. బిబిలో మన రచ్చ మామూలుగా ఉండదు. మీకు మరింత వినోదాన్ని పంచుతాను. మీ మద్దతు నాకు కావాలి”.. అని పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మరికొన్ని ఆసక్తికర విషయాలు సిద్ధంగా ఉన్నాయని అన్నాడు. రేపు సాయంత్రం అవి కూడా ప్రకటిస్తానని తెలిపాడు. మరి ఇక రేపు సాయంత్రం నందు ఏం ప్రకటిస్తాడో చూడాలి.

కాగా నందు భార్య గీతా మాధురి కూడా బిగ్‌బాస్ సీజన్-2 షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. సినీ, సీరియల్ నటుడు కౌశల్‌కి గట్టి పోటీని ఇచ్చింది గీతా మాధురి. కౌశల్‌తో పాటు ఫైనల్స్‌ వరకూ చేరి.. రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Read More:

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది