జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలు సస్పెండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలపై వేటు పడింది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీ మల్లారెడ్డి.. సీఐలు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ముగ్గురు పోలీసు అధికారులు జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. […]

జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలు సస్పెండ్
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 11:01 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోస్టల్ బ్యాంకు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో ముగ్గురు ఖాకీలపై వేటు పడింది. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏసీపీ మల్లారెడ్డి.. సీఐలు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ ముగ్గురు పోలీసు అధికారులు జయరాం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసు అధికారులకు పూర్తి ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ముగ్గురికి రాకేష్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గుర్ని సస్పెండ్ చేశారు.