కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మొదలైన లాక్ డౌన్ క్రమంలో, జార్ఖండ్ రాష్ట్రంలో చైబాసాలోని పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుంగ్-గడా గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన పోలీసు ఎన్కౌంటర్ లో జార్ఖండ్ పోలీసులు ముగ్గురు మావోయిస్టులను కాల్చి చంపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు జార్ఖండ్ సాయుధ పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు ప్రారంభించగా, వారు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.