AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీదీని చంపితే కోటి.. ఎవరిదా వార్నింగ్.?

పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అసలు వివరాల్లోకి వెళ్తే ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. దీదీని చంపి తల […]

దీదీని చంపితే కోటి.. ఎవరిదా వార్నింగ్.?
Ravi Kiran
|

Updated on: Jun 10, 2019 | 3:59 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లెటర్ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. సీఎం మమతా బెనర్జీ చంపితే కోటి ఇస్తామంటూ రాసిన ఈ లేఖపై తృణమూల్ నేతలు పోలీసులను ఆశ్రయించారు.

అసలు వివరాల్లోకి వెళ్తే ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌కు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. దీదీని చంపి తల తెచ్చినా.. సజీవంగా తీసుకొచ్చినా వారికి కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మమతా బెనర్జీ ఫోటోని మార్ఫింగ్ చేసి.. ఈ లేఖతో పంపారట. కాగా ఈ లేఖ రాజ్‌వీర్ కిల్లా అనే వ్యక్తి పేరుపై రాయగా.. ఎంపీ అపురూప శ్రీరామ్‌పూర్ పోలీసులకు లేఖను అప్పగించి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఇది ఇలా ఉండగా రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయి.. ఎవరో తనపై కుట్రపన్నారని..తనకు ఈ లేఖతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయితే గతంలో దీదీని జైశ్రీరామ్ నినాదాలతో ఇబ్బంది పెట్టిన బీజేపీ కార్యకర్తలే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని తృణమూల్ నేతలు ఆరోపించారు. ఇక పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

Follow Us
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..