జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

|

Oct 30, 2020 | 8:37 PM

జార్ఖండ్‌‌లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి స్థానిక ఆస్పత్రికి తరలించారు...

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us on

జార్ఖండ్‌‌లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

154 బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మధుబన్‌ నుంచి నిమియాఘాట్‌కు వెళ్తుండగా మధుబన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా రోడ్డుపై ఒక్కసారిగా పశువులు అడ్డురావడంతో వాహనాన్ని డ్రైవర్‌ నియంత్రించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గాయపడిన జవాన్లును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో హెలికాప్టర్‌లో రాంచీకి తరలించారు.