పోలీసులనే షాక్కు గురి చేసిన ఆటోవాలా.. ఏకంగా 16 మంది ప్రయాణం. నెట్టింట వైరల్గా మారిన ఫొటోలు.
మహబూబ్ నగర్కు చెందిన ఓ ఆటోవాలా చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. ఏకంగా పోలీస్ శాఖే ఈ విషయమై ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే అతను చేసిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపడక మానరు. ఇంతకీ విషయమేంటంటే..
Telangana police tweet about auto driver: మహబూబ్ నగర్కు చెందిన ఓ ఆటోవాలా చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారింది. ఏకంగా పోలీస్ శాఖే ఈ విషయమై ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే అతను చేసిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపడక మానరు. ఇంతకీ విషయమేంటంటే.. ఏడుగురు ప్రయాణించే ఆటోలో ఓ డ్రైవర్ ఏకంగా 16 మంది ఎక్కించాడు. దీనిని గమనించిన స్థానిక పోలీసులు ఆటోను ఆపి ఒక్కొక్కరిగా అందరినీ కిందికి దింపి, వరుసగా నిలబెట్టి ఫొటో తీశారు. అంతటితో ఆగని మహబూబ్ నగర్ పోలీసులు ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఏందన్నా!అది ఆటో నా ?? మినీ బస్సా ??7 సీటరా లేక 14 సీటరా ??ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?? https://t.co/ks8zxgdhLy
— Telangana State Police (@TelanganaCOPs) December 18, 2020
ఇక ఇదే ఫొటోను తెలంగాణ స్టేట్ పోలీస్ రీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. ‘ఏందన్నా! అది ఆటో నా ?? మినీ బస్సా ?? 7 సీటరా లేక 14 సీటరా ?? ఆటో నీది!, ప్రాణం ఆ అమాయకులది!, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది??’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.