AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డారు.  రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో ఖాకీలకు సవాల్ విసురుతున్నారు.

సైబర్ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2020 | 5:58 PM

Share

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డారు.  రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో ఖాకీలకు సవాల్ విసురుతున్నారు. ఇక నకిలీ ఫోన్‌ నంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్, ఆఫర్లు పేర్లతో పాత పద్దతులను కొనసాగిస్తూనే ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మరో కొత్త విధానంలో కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వారికి చెక్‌ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు యాక్టన్ ప్లాన్ రెడీ చేశారు. మోసాలను అరికట్టేందుకు పూర్తి అస్త్రాలతో రంగంలోకి దిగుతున్నారు. ఫేక్ ఫోన్‌ నంబర్లు ఉపయోగించి మోసాలు చేస్తున్నవారికి చెక్‌ పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి సిమ్‌ కార్డులు తీసుకుని ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, ధ్రువపత్రాలు సరిగా లేకున్నా అధిక మొత్తంలో సిమ్‌ కార్డులను ఇస్తున్న మూడు నెట్‌వర్క్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో 11వేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం.

సైబర్‌ నేరగాళ్లు కేటుగాళ్లు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సిమ్‌కార్డులు తీసుకుంటారు. ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరకు వాహనాలు, ఫోన్లు ఇతరత్రా వస్తువులు ఇస్తామంటూ, డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాకా ఫోన్‌ ఆఫ్ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలను, పేర్లను ఉపయోగిస్తోంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు. దీనిపై ఓఎల్‌ఎక్స్‌ కంపెనీకీ నోటీసులు పంపుతామని పోలీసులు వివరించారు.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..