మే నెల జీతంలో కట్ ఉంటుందా ? టెన్షన్.. టెన్షన్..!
సర్కార్ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా దెబ్బకి జీతం డబ్బులు మొత్తం చేతికొస్తోందా? రాదోనన్న ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ -19 దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖజనాపై భారీ ప్రభావం పడింది. ఇదే అంశంపై ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలాని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇవాళ అధికారికంగా స్పష్టత రానుంది. ఆర్థిక […]
సర్కార్ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా దెబ్బకి జీతం డబ్బులు మొత్తం చేతికొస్తోందా? రాదోనన్న ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ -19 దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖజనాపై భారీ ప్రభావం పడింది. ఇదే అంశంపై ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలాని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇవాళ అధికారికంగా స్పష్టత రానుంది. ఆర్థిక శాఖ మాత్రం మే నెలలోనూ సగం జీతాలిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ తరహాలోనే మే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ట్రెజరీ శాఖ డీడీలు, డీటీవోలు, టీవోలకు ఆదేశాలిచ్చినట్లు విశ్వనీయ సమాచారం. లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్జీతాలు సగమే ఇచ్చారు. కరోనా వ్యాప్తి నివారణలో కీలకంగా పని చేసిన కొన్ని శాఖలకే పూర్తి వేతనాలిచ్చారు. దీంతో ఈసారైనా పూర్తి వేతనం డబ్బులపై ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.