రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు

రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 12:14 AM

Dussehra Holiday : రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా ప్రకటించింది.

కేంద్రం మాదిరిగానే 26న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సంఘం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాసింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారం మూడు రోజు కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందాన్ని వ్యాక్తం చేశారు.

తెలంగాణ ప్రాంతంలో దసరాను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటుండంతో.. వారికి ఈ సెలవు దినం ఉపయోగకరం మారనుంది. కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ వ్యాప్తి  మొదలైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.