AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్డేట్: తెలంగాణలో ఒక్క రోజే 213 కేసులు, నలుగురు మృతి..

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నలుగురు మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 165 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 16, మెదక్ 13 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న […]

కరోనా అప్డేట్: తెలంగాణలో ఒక్క రోజే 213 కేసులు, నలుగురు మృతి..
Ravi Kiran
|

Updated on: Jun 16, 2020 | 11:43 PM

Share

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 213 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి నలుగురు మృతిచెందారు. నేటితో రాష్ట్రంలో మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్కరోజే 165 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 16, మెదక్ 13 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 261 మంది డిశ్చార్జ్ అయ్యారు.