AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన అనేది మొదట సీఎం జగన్ ఇంటినుంచి ప్రారంభించాలని ,ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ముఖాన దొంగ అని ముద్ర పడింది కాబట్టి అందరికీ ఆ ముద్ర వేయాలనుకుంటున్న మూర్ఖులు మీరే అంటూ మండిపడ్డారు. […]

ఇడుపులపాయ అవినీతిపై చర్యలేవీ..? వర్ల రామయ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 7:58 PM

Share

వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందని ఏపీ ప్రజలు భావిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రక్షాళన అనేది మొదట సీఎం జగన్ ఇంటినుంచి ప్రారంభించాలని ,ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ ముఖాన దొంగ అని ముద్ర పడింది కాబట్టి అందరికీ ఆ ముద్ర వేయాలనుకుంటున్న మూర్ఖులు మీరే అంటూ మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతను చూసిన ప్రజలు పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఉందంటూ బాధపడుతున్నారని వర్ల రామయ్య ట్వీట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరినొకరు ట్విట్టర్ వేదికగా విమర్శించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ శ్రేణులు కూడా అదేస్ధాయిలో తిప్పి కొడుతున్నారు.