
తబ్లీగీ జమాత్ సభ్యులు..ఓవరాక్షన్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా వారు దురుసు ప్రవర్తనను మార్చుకోవడం లేదు. యూపీ కాన్పుర్లోని రెండు హాస్పిటల్స్ లో మెడికల్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ప్లేట్లు విసిరికొట్టి.. సిబ్బందిపై గొడవకు దిగారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
‘తబ్లీగీ జమాత్ సభ్యులు.. భోజనం చేసేందుకు నిరాకరించడమే కాకుండా, మాంసాహారం కావాలని గొడవకు దిగారు. వార్డు బాయ్స్తో అనుచితంగా ప్రవర్తించారు. ప్లేట్లు విసిరికొట్టారు’ అని జీఎస్వీఎం వైద్య కళాశాల ప్రిన్సిపల్ అండ్ డీన్ డాక్టర్ ఆర్తి లాల్చందని పేర్కొన్నారు. గతంలోనూ తబ్లీగీ సభ్యులు డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. యూపీ నరేలాలో కొందరైతే ఏకంగా క్వారంటైన్ గదుల ముందు మలవిసర్జన చేయడం వివాదాస్పదమైంది.
కాన్పుర్లోని కాశీరామ్ ఆసుపత్రిలోనూ కోవిడ్ బాధితులు రెచ్చిపోయారు. కొందరు రోగులు ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ తరుణంలో రెచ్చిపోయిన బాధితులు ఘర్షణకు దిగి.. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు.