AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రఫేల్ కేసు రివ్యూ పిటిషన్ల తీర్పు రిజర్వు

డిల్లీ: రఫేల్‌ కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల రహస్య పత్రాలకు సంబంధించి లీకైన పేజీలను తొలగించాలని కోరింది. ఈ ఒప్పందంపై కోర్టుకు ఇచ్చిన కాగ్‌ నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని.. కనిపించకుండా పోయిన ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని […]

రఫేల్ కేసు రివ్యూ పిటిషన్ల తీర్పు రిజర్వు
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2019 | 7:26 AM

Share

డిల్లీ: రఫేల్‌ కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల రహస్య పత్రాలకు సంబంధించి లీకైన పేజీలను తొలగించాలని కోరింది. ఈ ఒప్పందంపై కోర్టుకు ఇచ్చిన కాగ్‌ నివేదికలో మొదటి మూడు పేజీలు లేవని.. కనిపించకుండా పోయిన ఆ పేజీలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏజీ కేకే వేణుగోపాల్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఏజీపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించిచారు. వేణుగోపాల్‌ తన వాదనలు వినిపిస్తూ రహస్య పత్రాలకు సంబంధించిన ఫొటో కాపీలతో పిటిషనర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారని వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ పత్రాల్లో కూడా సరైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.

ఏజీ వ్యాఖ్యలపై పిటిషినర్ ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రహస్య పత్రాలు లీకైతే కేంద్రం ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. భద్రతా సేవలకు భంగం కలిగించాలని గానీ, వాటిని అవమానించాలని గానీ తామీ పిటిషన్‌ వేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అందించిన కాగ్‌ రిపోర్టులో 10 ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలున్నాయని ఆయన అన్నారు. ఇందులో కొన్ని పత్రాలను ప్రభుత్వమే లీక్ చేసిందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పత్రాలను దొంగిలించి వాటిని ఫొటో కాపీ చేయించామని అనడానికి రుజువులు చూపించమని ఆయన ప్రశ్నించారు. ధర్మాసనం కూడా ప్రశాంత్‌ భూషణ్‌ వాదనను సమర్థించింది. పిటిషనర్‌కు సంబంధించిన వారి వాదనల్లో ఆధారాలు చూపించారని, ఏజీ కూడా తన వాదనలకు రుజువులు చూపాలని కోరింది. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.