“రిలయన్స్‌తో గూగుల్‌ జోడీ’పై స్పందించిన సుందర్‌!

రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ రూ. 33, 737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియోలో పెట్టుబడులపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

రిలయన్స్‌తో గూగుల్‌ జోడీ'పై స్పందించిన సుందర్‌!
Follow us

|

Updated on: Jul 15, 2020 | 9:39 PM

జియోలో పెట్టుబడులపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. “ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండాలని తెలిపారు. గూగుల్‌ ఫర్‌ ఇండియా డిజిటైజేషన్‌ ఫండ్‌లో భాగంగా తొలుత రూ. 33,737 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జియోతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తద్వారా భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌లేని లక్షలాది మందికి ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో తాము భాగస్వాములం కావడం గొప్పగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం జియోతో కలిసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉందంటూ.. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ రూ. 33, 737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని అంబానీ వివరించారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.