మద్య౦ మత్తులో బాలికలు

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:19 PM

ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలో తూలుతు౦డడ౦…ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది. వారు మద్యం తాగి తరగతులకు వస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులంతా ముక్కున వేలేసుకున్న ఈ ఘటన విజయవాడ శివారులో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం […]

మద్య౦ మత్తులో బాలికలు
Follow us on

ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలో తూలుతు౦డడ౦…ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది. వారు మద్యం తాగి తరగతులకు వస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులంతా ముక్కున వేలేసుకున్న ఈ ఘటన విజయవాడ శివారులో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం మొదలుపెట్టారు. వారి నుంచి మద్యం తాగిన వాసన వస్తుండటంతో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానోపాధ్యాయుడు వైద్య నిపుణులతో మద్యం పరీక్ష చేయించారు. బాలికలు మద్యం తాగినట్లు తేలడంతో ఖంగుతిన్నారు. తల్లిదండ్రులను పిలిపించి, విద్యార్థులతోపాటు వారికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా, విద్యార్థినులు మద్యం తాగి తరగతికి రావడం వాస్తవమే అని తెలిపారు. వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చినట్లు తెలిసింది.