AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు- సానియా మీర్జా

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరోసారి పుల్వామా ఘటనపై స్పందించారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఈ దారుణం తనని ఎంతో కలిచి వేసిందని ఆమె ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. అయితే ఘటన జరిగిన రోజున సానియాను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఆమె పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే దాడిపై తొలుత సానియా మీర్జా స్పందించలేదు. తను హ్యపీగా ఉన్న వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాలో […]

ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు- సానియా మీర్జా
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:50 PM

Share

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరోసారి పుల్వామా ఘటనపై స్పందించారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఈ దారుణం తనని ఎంతో కలిచి వేసిందని ఆమె ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. అయితే ఘటన జరిగిన రోజున సానియాను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఆమె పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే దాడిపై తొలుత సానియా మీర్జా స్పందించలేదు. తను హ్యపీగా ఉన్న వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసి డ్రస్ ఫలానా వాళ్లు డిజైన్ చేశారు, హెయిర్ స్టైలిస్ట్ ఫలానా వాళ్లు అంటూ చెప్పడం వివాదాలకు తావిచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.పుల్వామా దాడిలోనూ పాకిస్థాన్‌ హస్తం ఉండటంతో నెటిజన్లు సానియాపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. కొంత సేపటి తర్వాత ఆత్మాహుతి దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. అయినా చాలా మంది భారతీయులు సానియాకు అసలు దేశం పట్ల గౌరవం, అంకింత భావం లేదంటూ విమర్మలు ఎక్కుపెడుతుండటంతో…. మళ్లీ ఈ ఘటన గురించి ఓ లేఖలో రాసి దాన్ని పోస్ట్‌ చేసింది.

‘పుల్వామా ఘటనపై ప్రముఖులందరూ స్పందించాలనే వారికి ఈ పోస్టు పెడుతున్నాను.మన దేశంలో హింసకు తావు లేదు. హింసకు దారి తీసే అంశాలన్నింటినీ మనం విచ్ఛిన్నం చేయాలి. ఈ దానిని బహిరంగంగా ఖండించాల్సిన అవసరం లేదు. మనం ఉగ్రవాదానికి వ్యతిరేకం అని ఏకతాటిపై నిలబడాలి. నా దేశం గురించి నేను ప్రార్థిస్తున్నాను. దాని కోసం నేను చెమట చిందిస్తున్నాను. ఇదే నేను దేశానికి చేసే సేవ. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు నేను మద్దతుగా ఉంటాను. మన దేశాన్ని రక్షిస్తున్న హీరోలకు మనం సాయపడాలి, గౌరవించాలి. 14 ఫిబ్రవరి దేశ ప్రజలకు చీకటి రోజు. మరోసారి ఇలాంటి రోజు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. జవాన్ల కుటుంబాలను మన సంతాపాలు గట్టెకించవు. ఇంకా ఏదో చేయాలి. ఆ రోజును మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నిందితులను క్షమించకూడదు.ఇలాంటి సమయాల్లో మన దేశానికి సేవ చేసే మార్గాలను వెతుక్కోవాలి కానీ…ఏ ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారనేది అప్రస్తుతం. ప్రముఖులు ఎన్ని పోస్టులు పెట్టారు? ఈ భయానక దాడి మీద ఎంత సేపు మాట్లాడరనే దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ లాభం లేదు. మీరేమి చేయగలరో అన్నీ చేయండి. సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకోకుండా సాయం చేయండి’ అని లేఖలో చెప్పుకొచ్చింది.