ఇప్పటికి ప్రెస్ మీట్ రద్దు చేసుకుంటున్నాం.. కానీ మేము మిర్యాలగూడకు కచ్చితంగా వస్తాము.

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మర్డర్ సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో మిర్యాలగూడ నటరాజ్ థియేటర్‌లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు వర్మ గతంలో ప్రకటించారు. అయితే గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రెస్ మీట్‌కు అనుమతులు నిరాకరించారు.

ఇప్పటికి ప్రెస్ మీట్ రద్దు చేసుకుంటున్నాం.. కానీ మేము మిర్యాలగూడకు కచ్చితంగా వస్తాము.
Follow us

|

Updated on: Dec 21, 2020 | 9:51 PM

rgv about miryalaguda press meet: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య ఆధారంగా ‘మర్డర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వర్మ ఈ సినిమా ప్రకటించన నాటి నుంచి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో మిర్యాలగూడ నటరాజ్ థియేటర్‌లో ప్రెస్ మీట్ పెడుతున్నట్లు వర్మ గతంలో ప్రకటించారు. అయితే గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రెస్ మీట్‌కు అనుమతులు నిరాకరించారు.

దీంతో ఈ విషయమై వర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వర్మ ట్వీట్ చేస్తూ.. ‘మాకు అనుమతులు రాకపోవడంతో మిర్యాలగూడ నటరాజ్ థియేటర్‌లో ఏర్పాటు చేయాలనుకున్న ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నాం. కానీ తర్వాత కచ్చితంగా మిర్యాలగూడ వస్తాము. మాకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఎస్పీ గారికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు వర్మ. ఇక మర్డర్ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. మరి మర్డర్‌ ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి.