వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్‌

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: May 31, 2019 | 7:10 PM

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను ఎంపీగా గెలిచిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జూన్‌ 7 నుంచి రెండ్రోజుల పాటు  నియోజకవర్గంలోని వివిధ  ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్‌ ధన్యవాదాలు తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే 24న ట్విటర్‌ ద్వారా రాహుల్‌ వయనాడ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ లోక్‌సభ స్థానంలో రాహుల్‌కు […]

వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను ఎంపీగా గెలిచిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జూన్‌ 7 నుంచి రెండ్రోజుల పాటు  నియోజకవర్గంలోని వివిధ  ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్‌ ధన్యవాదాలు తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే 24న ట్విటర్‌ ద్వారా రాహుల్‌ వయనాడ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ లోక్‌సభ స్థానంలో రాహుల్‌కు 7,05,034 ఓట్లు పోలవ్వగా.. 4,31,063 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆయన ప్రత్యర్థిగా లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్డీఎఫ్‌) నుంచి పీపీ సునీర్‌ పోటీశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu