తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన బయల్దేరారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ‘ఏపీకి ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర’ బహిరంగ సభలో పాల్గొంటారు. హోదాపై పార్టీ వైఖరిని వెల్లడించనున్నారు.