ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం

జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 మంది విపక్ష నాయకులను అక్కడినుంచి తిరిగి ఢిల్లీ పంపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. వీరికి, ఖాకీలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. కాశ్మీర్ లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్న దృష్ట్యా.. రాజకీయ నాయకులు శ్రీనగర్ ను విజిట్ చేయరాదని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని జమ్మూ కాశ్మీర్ సమాచార, ప్రసార […]

ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం
Follow us

|

Updated on: Aug 24, 2019 | 4:29 PM

జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 మంది విపక్ష నాయకులను అక్కడినుంచి తిరిగి ఢిల్లీ పంపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. వీరికి, ఖాకీలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. కాశ్మీర్ లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్న దృష్ట్యా.. రాజకీయ నాయకులు శ్రీనగర్ ను విజిట్ చేయరాదని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని జమ్మూ కాశ్మీర్ సమాచార, ప్రసార శాఖ ట్వీట్ చేసింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఇతర దాడుల ముప్పు ఉన్న నేపథ్యంలో.. వాటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం రక్షిస్తున్నందున వీరి రాక వల్ల పరిస్థితి మరింత జటిలం కావచ్ఛునని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, సీనియర్ నేతలు వచ్చినందువల్ల మళ్ళీ ఇది ఉద్రిక్తతకు దారి తీయవచ్చునని అధికారులు అంటున్నారు.

రాహుల్ తో బాటు వెళ్లిన పార్టీల నాయకుల్లో సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసి, డీఎంకె కు చెందినవారున్నారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం అక్కడి తాజా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీరంతా విమానంలో శ్రీనగర్ బయల్దేరారు. అయితే తామంతా బాధ్యతాయుతమైన పార్టీలకు చెందిన నేతలమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అక్కడికి వెళ్లడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ అంతకుముందు ఢిల్లీలో పేర్కొన్నారు. 20 రోజులుగా కాశ్మీర్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. పరిస్థితి నార్మల్ గానే ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు.. ? అని వారు ప్రశ్నించారు. కాగా-రాహుల్ వెంట వెళ్లిన ప్రతిపక్ష పార్టీల నేతల్లో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ. రాజా, (సీపీఐ), తిరుచ్చి శివ (డీఎంకె), మనోజ్ ఝా (ఆర్జేడీ), దినేష్ త్రివేదీ (టీఎంసీ) తదితరులున్నారు.