నిరసనలో సరికొత్త రూట్, ఢిల్లీలోని బురారీ మైదానమే పొలంగామారిన వైనం, నిరంకారీ సమాగం గ్రౌండ్ లో ఉల్లి పంట ‘ప్రత్యక్షం’
రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలు సరికొత్త నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని బురారీలో గల నిరంకారీ సమాగం గ్రౌండ్ లో వారు ఉల్లి పంట వేస్తున్నారు..

Farmers Protest:రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలు సరికొత్త నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని బురారీలో గల నిరంకారీ సమాగం గ్రౌండ్ లో వారు ఉల్లి పంట వేస్తున్నారు. సుమారు నెలరోజులుగా మేం ఇక్కడ ఈ పంట వేయడానికి సిధ్దపడ్డాం.. ఈ ఉదయం నుంచి నీరు పొసే పనిని ప్రారంభించాం అని వారు చెప్పారు. ఇక్కడ ఉల్లిపంట వేయడం తప్ప మేమేం చేయడం లేదు అని వారు తెలిపారు. ఈ గ్రౌండ్ లో మరిన్ని పంటలు వేస్తామన్నారు.
Delhi: Protesting farmers say they’re using Nirankari Samagam ground in Burari to grow crops.
“Since we’ve been sitting idle for a month during protests, we thought of growing onions as we can use it for our daily cooking. We’ll grow more crops on Burari ground,” says a farmer. pic.twitter.com/hvNOHwVF31
— ANI (@ANI) December 27, 2020
నిజానికి ఈ నిరంకారీ గ్రౌండ్ ని రైతుల ఆందోళనకు అధికారులు అనుమతినిచ్చారు. కానీ అన్నదాతలు ఇలా ఇక్కడ వెరైటీగా ఉల్లిపంట వేయడం సంచలనంగా మారింది. కాగా ఈ నెల 29 న కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య మళ్ళీ చర్చలు జరగనున్నాయి. కేంద్రంతో జరిగే చర్చల సందర్భంగా తాము పాటించాల్సిన వ్యూహంపై ఈ సంఘాలు అప్పుడే సంప్రదింపులు ప్రారంభించాయి.
కాగా రైతు సంఘాలు నాలుగు పాయింట్ల అజెండాను రూపొందించాయి. మా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, ఆందోళనను వక్రీకరించేందుకు జరుగుతున్న యత్నాలను ఆపివేయాలని కేంద్రాన్ని ఈ సంఘాలు కోరాయి. రైతు చట్టాల రద్దుకు విధివిధానాలను సిధ్ధం చేయాలని, అలాగే ముసాయిదా విద్యుత్ సవరణ బిల్లులో మార్పులు చేయాలని సూచించాయి. ఇప్పటివరకు రైతు సంఘాలు కేంద్రంతో అయిదు దఫాల చర్చలు జరిపాయి.
Read More:
11 గంటలకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయానికి రావాలని వైసీపీ ఎమ్మెల్యే అమర్ సవాల్
పతనమైన అరటి ధరలు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు.. కిలో రెండు రూపాయలకే విక్రయం.!



