రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

| Edited By:

May 13, 2020 | 3:02 PM

తాజాగా వీరిద్దరూ కలిసి ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాగా పెళ్లి తర్వాత తన భార్య పేరును తన జాతకం ప్రకారం వైఘా రెడ్డిగా..

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్
Follow us on

గత రెండు రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 10వ తేదీ ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. బ్రాహ్మణ యువతి అయిన తేజస్వినీని.. దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోన్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాగా జాతకం ప్రకారం తేజస్వీని పేరును వైఘారెడ్డిగా మార్చారు.

మూడేళ్ల క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత.. అనారోగ్యంతో కన్ను మూశారు. అప్పటి నుంచీ ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో అది గమనించిన దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంది. బరువైన బాధ్యతను భుజాన వేసుకుని పెళ్లి పెద్దగా వ్యవహరించింది. మొత్తానికి తన తండ్రికి రెండో వివాహం చేసింది.

Read More:

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వావ్ వాటే టెక్నాలజీ.. వాట్సాప్‌లో ఒకేసారి 50 మందితో వీడియో కాల్!