
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని ప్రియాంకా గాంధీ విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నసింగ్కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు.
ఆమె మాట్లాడుతూ ‘ మోదీ వంటి భయస్తుడు, బలహీనమైన ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ మర్చిపోయారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చిందని దుయ్యబట్టారు. తమ పార్టీ లేదా తమ పార్టీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రాగానే పేదల కోసం తీసుకొచ్చిన న్యాయ్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. అలాగే, తాము అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిదినాలను 150కు పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు.