నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ.. 6.47 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లతో మొదటి స్థానం

|

Jan 11, 2021 | 11:37 AM

ప్రధానమంత్రి నరేంద్ర ట్విట్టర్‌లో మోదీ దూసుకుపోతున్నారు. ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ టాప్ నెంబర్ వన్..

నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ.. 6.47 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లతో మొదటి స్థానం
Follow us on

World’s Most Active Politician : ప్రధానమంత్రి నరేంద్ర ట్విట్టర్‌లో మోదీ దూసుకుపోతున్నారు. ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ టాప్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు.

వాషింగ్టన్​లోని క్యాపిటల్​ భవనంపై ట్రంప్​ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్​ శాశ్వతంగా తొలిగించింది. దీంతో ప్రధాని మోదీకి 6.47 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లతో మొదటి స్థానంను దక్కించుకున్నారు.

క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్​లో అనుసరిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్​ ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్.. సౌతాఫ్రికా మ్యుటేషన్‌ కూడా దేశంలోకి ఎంట్రీ

Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్‌‌ను తాకిన సెన్సెక్స్

సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు..‌ ఆధార్​ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు