
న్యూఢిల్లీ: పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ స్వయంగా పలువురి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.