మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఉల్లాస్నగర్లోని జులేలాల్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి గదిలో స్టూడెంట్స్ క్లాసులో పాఠాలు వింటుడంగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. ఈ ఘటనతో విద్యార్ధులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధినులు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని.. యాజమాన్యంపై మండిపడ్డారు. స్కూల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యాజమాన్యం మాత్రం ఇది చిన్న ఘటనే అంటూ తేలికగా కొట్టిపారేసింది. విద్యార్ధినులకు చిన్నపాటి గాయాలే అయ్యాయని తెలిపింది. ప్రమాదానికి సబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
#WATCH: Three students were injured after a portion of cement plaster collapsed on them while they were attending class in Ulhasnagar’s Jhulelal School, Maharashtra yesterday. pic.twitter.com/luXzWD4TAI
— ANI (@ANI) June 19, 2019