రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ సీనియర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని, ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడమన్నారు. బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.