AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కుట్ర భగ్నం..

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కుట్రను భగ్నం చేశారు పోలీసులు. జి.మాడుగులలో మందు పాతరలను అమర్చిన మావోయిస్టులు.. భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారు. నుర్మతి ఔట్ పోస్ట్ వద్ద 4 మందుపాతరలను పేల్చి తమ ఉనికిని చాటుకోవాలని ప్లాన్ వేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నుర్మతి ఔట్ పోస్ట్ ప్రాంతంలో మందుపాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు… బాంబ్ స్కాడ్ సహాయంతో 4 మందుపాతరలను వెలికి […]

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కుట్ర భగ్నం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 9:12 AM

Share

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కుట్రను భగ్నం చేశారు పోలీసులు. జి.మాడుగులలో మందు పాతరలను అమర్చిన మావోయిస్టులు.. భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారు. నుర్మతి ఔట్ పోస్ట్ వద్ద 4 మందుపాతరలను పేల్చి తమ ఉనికిని చాటుకోవాలని ప్లాన్ వేశారు.

అయితే అనుమానం వచ్చిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నుర్మతి ఔట్ పోస్ట్ ప్రాంతంలో మందుపాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు… బాంబ్ స్కాడ్ సహాయంతో 4 మందుపాతరలను వెలికి తీశారు.

ఈ వ్యవహారంలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో 12 మందిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాండ్‌మైన్లను ఎవరు అమర్చారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.