అన్నదాతల ఆందోళన, సుప్రీంకోర్టులో పిటిషన్, తక్షణమే వారిని ఖాళీ చేయించాలని పిటిషనర్ విన్నపం

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 7:13 PM

రైతుల ఆందోళనపై మొదటిసారిగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. శివార్లలోను, నగరంలోనూ నిరసన తెలుపుతున్న అన్నదాతల కారణంగా అత్యవసర వైద్య సర్వీసులకు ఆటంకం కలుగుతోందని, పైగా కరోనా వైరస్ మరింత ప్రబలం కావచ్చునని..

అన్నదాతల ఆందోళన, సుప్రీంకోర్టులో పిటిషన్, తక్షణమే వారిని ఖాళీ చేయించాలని పిటిషనర్ విన్నపం
Follow us on

రైతుల ఆందోళనపై మొదటిసారిగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. శివార్లలోను, నగరంలోనూ నిరసన తెలుపుతున్న అన్నదాతల కారణంగా అత్యవసర వైద్య సర్వీసులకు ఆటంకం కలుగుతోందని, పైగా కరోనా వైరస్ మరింత ప్రబలం కావచ్చునని రిషబ్ శర్మ అనే లా స్టూడెంట్ ఈ రిట్ దాఖలు చేశారు. ఆందోళన చేస్తున్నవారిని తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేట్టు చూడాలని, బురారీ ప్రాంతంలో వారి ప్రొటెస్ట్ కి పోలీసులు, ప్రభుత్వం అనుమతించినప్పటికీ వారు సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో నిరసన చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా బహిరంగ స్థలాలను ధర్నా వేదికలుగా ఉపయోగించుకోకుండా చూడాలని లోగడ సీఏఎ ప్రొటెస్ట్ సందర్భంగా సుప్రీంకోర్టే  స్వయంగా కేంద్రానికి సూచించిందని, ఉత్తర్వులు జారీ చేసిందని రిషబ్ శర్మ గుర్తు చేశారు. ధర్నా చేసుకునేందుకు ప్రత్యేకంగా కొన్ని నిర్ధేశిత ప్రాంతాలను నిర్ణయించాలని కూడా నాడు న్యాయస్థానం పేర్కొన్నదని ఆయన అన్నారు. లక్షలాదిరైతుల నిరసనల కారణంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..