షాకింగ్ : వికలాంగురాలైన గ్రామవాలంటీర్, ట్రై సైకిల్‌లో కూర్చున్న స్థితిలోనే కాలి బూడిదై కనిపించిన వైనం

|

Dec 19, 2020 | 1:03 PM

ఒంగోలు శివారులో దారుణం చోటుచేసుకుంది. వికలాంగురాలైన ఓ యువతి.. ట్రై సైకిల్‌లో కూర్చున్న స్థితిలోనే కాలి బూడిదై కనిపించింది. యువతిని చంపి..

షాకింగ్ : వికలాంగురాలైన గ్రామవాలంటీర్, ట్రై సైకిల్‌లో కూర్చున్న స్థితిలోనే కాలి బూడిదై కనిపించిన వైనం
Follow us on

ఒంగోలు శివారులో దారుణం చోటుచేసుకుంది. వికలాంగురాలైన ఓ యువతి.. ట్రై సైకిల్‌లో కూర్చున్న స్థితిలోనే కాలి బూడిదై కనిపించింది. యువతిని చంపి తగులబెట్టి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, కమ్మపాలెం వాలంటీర్‌గా పనిచేస్తున్న భువనేశ్వరి.. నిన్న కూడా యధావిధిగా ఆఫీసుకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోయే సరికి తల్లి అప్పటికే రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసింది. మరో అరగంటలో ఇంటికి వస్తానని చెప్పిన కూతురు.. ఇలా కాలి బూడిదై కనిపించే సరికి ఆ తల్లి బోరును విలపిస్తోంది. నిర్మానుష్యంగా ఉండే దశరాజుపల్లి రోడ్డులోకి తనబిడ్డ ఒంటరిగా వచ్చే అవకాశం లేనే లేదని మృతురాలి తల్లి వాపోయింది . మరి ఎవరు తీసుకెళ్లి ఉంటారు.. వికలాంగురాలైన యువతిని చంపాల్సిన అవసరం ఏముందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఘటనాస్థలంలో హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు యువతి ఆధార్‌కార్డును గుర్తించారు పోలీసులు. అప్పటి వరకు కమ్మపాలెంలోనే ఉన్నానని తల్లికి చెప్పిన భువనేశ్వరి.. రాత్రి 7గంటల తర్వాత ఎవరిని కలిసింది.. ఎవరితో మాట్లాడిందన్న దానిపై తెలుసుకునే యత్నం చేస్తున్నారు. భువనేశ్వరి ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా విచారిస్తున్నారు. ఎంబీఏ చదువుతూనే వాలంటీర్‌గా పనిచేస్తూ తల్లికి తోడుగా ఉంటోంది భువనేశ్వరి. ఇటీవల పరీక్షలు కూడా రాసిందని, తన కూతురును పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని తల్లి వేడుకుంటోంది.