AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

వాహనదారులకు పెట్రోల్ భారం పెరుగుతూనే వ‌స్తోంది. గురువారం పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు కూడా పైకి ఎగ‌సింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2020 | 7:48 AM

Share

వాహనదారులకు పెట్రోల్ భారం పెరుగుతూనే వ‌స్తోంది. గురువారం పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు కూడా పైకి ఎగ‌సింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఫ‌లితంగా శుక్ర‌వారం హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ.84.38కు చేరింది. డీజిల్ రేటు రూ.80.17 వద్ద నిలకడగా కొనసాగింది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర నేడు 19 పైసలు పెరిగి రూ.85.97కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32 వద్ద నిల‌క‌డ‌గా ఉంది. ఇక విజయవాడలో ధరల విష‌యానికి వ‌స్తే.. పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.85.53కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద నిల‌క‌డ‌గా ఉంది. ఢిల్లీలో నేడు 19 పైసలు పెరిగిన పెట్ర‌ల్ ధ‌ర‌ రూ.81.19కు చేరింది. డీజిల్ ధర నిల‌కడ‌గా రూ.73.56 వద్ద ఉంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. అందుకే పెట్రోల్‌ రేటు స్వ‌ల్పంగా పెరిగింది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ముడిచమురు రేట్ల‌ ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుచేర్పులు చేస్తుంటాయి. ఈ క్ర‌మంలో ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే నిల‌క‌డ‌గా కూడా కొనసాగవచ్చు.

Also Read : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 9 మంది గల్లంతు