AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించిన పాయల్ ఘోష్.. విచారణ సరిగా చేయడం లేదంటూ ట్వీట్.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుర్యాగ్ కశ్యాప్ తనపై లైంగిక దాడికి దిగాడంటూ నటి పాయల్ ఘోష్ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ముంబై పోలీసుల తీరుపై ఘాటుగా స్పందించిన పాయల్ ఘోష్.. విచారణ సరిగా చేయడం లేదంటూ ట్వీట్.
Narender Vaitla
|

Updated on: Dec 22, 2020 | 4:33 PM

Share

Payal ghosh fires on mumbai police: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుర్యాగ్ కశ్యాప్ తనపై లైంగిక దాడికి దిగాడంటూ నటి పాయల్ ఘోష్ అప్పట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పలువురు పాయల్‌కు మద్ధతు నిలువగా అనూహ్యంగా మరికొందరు అనురాగ్‌కు అండగా నిలిచారు. ఈ విషయమై పాయల్ ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసి మూడు నెలలు గడుస్తోన్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాయల్ ఘాటూగా స్పందించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన పాయల్.. ‘నేను అనురాగ్‌పై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడుస్తోన్నా పోలీసులు ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు విచారణ సరిగ్గా చేయడం లేదు. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, ఇది ఓ మహిళకు సంబంధించిన విషయం. దీని ద్వారా సమాజానికి ఏం చేప్పాలనుకుంటున్నారు’ అంటూ పాయల్ ట్వీట్ చేశారు.