AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌ డిఎన్‌ఏ లోనే “టెర్రరిజం” ఉంది: భారత్

ప్యారిస్‌లో జరుగుతున్న యునెస్కో సదస్సులో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్‌ అంశానికి భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ పాక్‌ ప్రతినిధులను ఏకిపారేశారు. పాక్‌ అనుసరిస్తున్న పద్ధతులు, విపరీత పోకడలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని ఆమె వివరించారు. అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ అంశం లేవనెత్తడం, భారతదేశానికి వ్యతిరేకంగా విషాన్ని ప్రేరేపించడం, యునెస్కో వేదికను రాజకీయం చేయడాన్ని అనన్య ఖండించారు. అణు యుద్ధాన్ని బహిరంగంగా ప్రకటించడం, […]

పాకిస్థాన్‌ డిఎన్‌ఏ లోనే టెర్రరిజం ఉంది: భారత్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 15, 2019 | 12:36 PM

Share

ప్యారిస్‌లో జరుగుతున్న యునెస్కో సదస్సులో పాకిస్తాన్ లేవనెత్తిన కశ్మీర్‌ అంశానికి భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం పాకిస్తాన్ డీఎన్‌ఏలోనే ఉందంటూ భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌ పాక్‌ ప్రతినిధులను ఏకిపారేశారు. పాక్‌ అనుసరిస్తున్న పద్ధతులు, విపరీత పోకడలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని ఆమె వివరించారు. అవకాశం దొరికినప్పుడల్లా కాశ్మీర్ అంశం లేవనెత్తడం, భారతదేశానికి వ్యతిరేకంగా విషాన్ని ప్రేరేపించడం, యునెస్కో వేదికను రాజకీయం చేయడాన్ని అనన్య ఖండించారు.

అణు యుద్ధాన్ని బహిరంగంగా ప్రకటించడం, ఇతర దేశాలపై ఆయుధాల ప్రయోగం లాంటి వ్యాఖ్యలు చేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ ఇటువంటి ఘనత పాకిస్తాన్ దేనని ఎంఎస్ అగర్వాల్ అన్నారు. “పాకిస్తాన్ మాజీ అధ్యక్షులలో ఒకరైన జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఇటీవల ఒసామా బిన్ లాడెన్ మరియు హక్కానీ నెట్‌వర్క్ వంటి ఉగ్రవాదులను పాకిస్తాన్ వీరులుగా పిలిచారని నేను వారికి చెబితే ఈ సమావేశం నమ్ముతుందా” అని అనన్య ప్రశ్నించారు.

1947 నుండి, పాకిస్తాన్ జనాభాలో మైనారిటీలు 23 శాతంగా ఉన్నప్పుడు, వారు ఇప్పుడు దాదాపు 3 శాతానికి తగ్గిపోయారు. ఇది క్రైస్తవులు, సిక్కులు, హిందువులు, షియాస్, సింధీలను బలవంతపు తపు మతమార్పిడులకు గురిచేసింది. మహిళలపై నేరాలు, హత్యలు, యాసిడ్ దాడులు బలవంతపు వివాహాలు మరియు బాల్యవివాహాలు పాకిస్తాన్‌లో తీవ్రమైన సమస్యగా ఉన్నాయి అని అనన్య వివరించారు.