ఎన్నికల దిశగా మరో అడుగు… వేగం పెంచిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా బల్దియా అధికారులు వేగం పెంచారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరిస్తుండగా.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే లోపు కార్యాచరణతో […]
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా బల్దియా అధికారులు వేగం పెంచారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరిస్తుండగా.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు.
ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే లోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని లోకేష్ కుమార్ నిర్దేశించారు.
ఎన్నికల అధికారి చేసిన సూచనలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గతంలో వినియోగించిన పోలింగ్ కేంద్రాల జాబితాను సేకరించిన అధికారులు మార్పులు చేర్పులపై కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాలలో వసతులపై కూడా వారు ఫోకస్ చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు టేకప్ చేయాల్సిన కార్యాచరణపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.