
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభం 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దాదాపు రెండింతలు పెరిగి రూ.1,630.01 కోట్లకు చేరుకుంది. అధిక చమురు ధరల కారణంగా, ఈ త్రైమాసికంలో కంపెనీ ఇప్పటివరకు ఏ త్రైమాసికంతో పోలిస్తే అత్యధిక నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21 చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 847.56 కోట్లుగా ఉంది. అదే సమయంలో, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం కూడా రూ.3,887.31 కోట్లకు పెరిగింది. 2021-22 నాలుగో త్రైమాసికంలో కంపెనీ వ్యాపారం 27 శాతం పెరిగి రూ.4,972.91 కోట్లకు చేరుకుంది. మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 55 శాతం పెరిగి రూ.16,427.65 కోట్లకు చేరుకుంది. OIL డైరెక్టర్ల బోర్డు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 5 తుది డివిడెండ్ను సిఫార్సు చేసింది. అంతకుముందు Fదే ఆర్థిక సంవత్సరానికి, డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుకు రూ.9.25 మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. దీని ఆధారంగా మొత్తం డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.14.25గా ఉంది.
ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్లో ఆయిల్ ఇండియా స్టాక్ 4.28 శాతం క్షీణించి రూ.218 వద్ద ముగిసింది. రూ.267 ఈ స్టాక్ 52 వారాల గరిష్టం. రూ.120 అనేది 52 వారాల కనిష్ట స్థాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.23640 కోట్లు. గత వారంలో ఈ స్టాక్ దాదాపు 9 శాతం పతనం కాగా, ఒక్క నెలలోనే 6 శాతం పడిపోయింది. ఈ స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10 శాతం, గత ఏడాదిలో 65 శాతం రాబడిని ఇచ్చింది. మరోవైపు, ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నికర లాభం మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం క్షీణించి రూ. 2,130.53 కోట్లకు చేరుకుంది. ఖర్చు పెరిగినా.. చాలా కాలంగా ఇంధన ధరలు స్తంభించిపోవడంతో కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టాయి. ఏడాది క్రితం, 2020-21 ఇదే త్రైమాసికంలో రూ. 11,940.13 కోట్ల నికర లాభం ఆర్జించింది.