కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించిన కుర్రహీరో.. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్

|

Nov 30, 2020 | 4:47 PM

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ కుర్ర హీరో ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. అయితే నేడు కార్తీక పూర్ణమి కావడంతో  గుడిలో దీపాలను వెలిగించాడు.

కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించిన కుర్రహీరో.. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ కుర్ర హీరో ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. అయితే నేడు కార్తీక పూర్ణమి కావడంతో  గుడిలో దీపాలను వెలిగించాడు. సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించాడు నిఖిల్. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్ మిగిలిన భక్తులతో పాటు దేవాలయంలో దీపాలను వెలిగించాడు.

ప్రతి ఏడాది తాను ఇలా దీపాలను వెలిగిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘కార్తికేయ’ సీక్వెల్ పైన మంచి బజ్ ఏర్పడింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ సీక్వెల్ పైన ప్రత్యేక దృష్టిపెట్టాడు నిఖిల్. మరో రెండు సినిమాలను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఈ కుర్రహీరో.