AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా పేరుతో వెరైటీ మామిడి పండు!

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో త్వరలోనే కొత్త రకం మామిడి పండ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇకపోతే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత అమిత్ షా‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో అమిత్ షా ప్రమేయం చాలావరకూ ఉండనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘మ్యాంగో మ్యాన్’గా పేరున్న ఉత్తరప్రదేశ్ మలీహాబాద్‌కు చెందిన హాజీ కలీముల్లా ఓ కొత్త రకం మామిడికి  ‘షా’ పేరు […]

అమిత్ షా పేరుతో వెరైటీ మామిడి పండు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 10:16 AM

Share

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో త్వరలోనే కొత్త రకం మామిడి పండ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇకపోతే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత అమిత్ షా‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో అమిత్ షా ప్రమేయం చాలావరకూ ఉండనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘మ్యాంగో మ్యాన్’గా పేరున్న ఉత్తరప్రదేశ్ మలీహాబాద్‌కు చెందిన హాజీ కలీముల్లా ఓ కొత్త రకం మామిడికి  ‘షా’ పేరు పెట్టారు. ఇక ఈ మామిడి పండ్లు త్వరలోనే మార్కెట్‌లో దర్శనమివ్వనున్నాయి.

ఈ సందర్భంగా కలీముల్లా మాట్లాడుతూ ‘మంచి బరువు, అమోఘమైన రుచితో అద్భుతంగా ఉండే ఈ ఫలానికి అమిత్ షా పేరు పెట్టడం కరెక్టేనని’ పేర్కొన్నాడు. కాగా ఈ మామిడి పండు షాకు తప్పకుండా నచ్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  దీనిని షా మామిడిగా పిలవనున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరోవైపు ‘పద్మశ్రీ’ గ్రహీత అయిన కలీముల్లా 2015లో కాసిన ఓ అరుదైన మామిడి పండుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్టిన సంగతి తెలిసిందే. అటు కలీముల్లా తన తోటలో రకరకాల మామిడి వంగడాలను పండిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.