AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ ఉదాత్త లక్ష్యంతో తెచ్చిన పథకం అది : కేటీఆర్

ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే ఉదాత్త లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు..

కేసీఆర్ ఉదాత్త లక్ష్యంతో తెచ్చిన పథకం అది : కేటీఆర్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 15, 2020 | 8:03 PM

Share

ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే ఉదాత్త లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద మున్సిపల్ పట్టణాల్లో పనుల పురోగతిని మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. హైదరాబాదు మినహాయించి రాష్ట్రంలో ఉన్న 141 మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులపై కేటీఆర్ సమీక్ష జరిపారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, టౌన్లకు కొంచెం వేగంగా విస్తరించే స్వభావం ఉంటుంది కావున.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ టౌన్లలో పనుల పురోగతి ఎలా ఉన్నది, ఎక్కడన్నా ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయం అవసరమా అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ మిషన్ భగీరథ కింద సరఫరా అవుతున్న నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, దీనికొరకు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, నీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.