ఈయన గారి మోసానికి ఇప్పుడే అవకాశం దొరికింది..!

కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు జనం. మరో వైపు దేశంలో ఉన్న లాక్‌డౌన్‌ను కూడా క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు అక్రమార్కులు. లాక్‌డౌన్‌లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం అక్రమార్కులు ఫేక్‌ ఈ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబైలోని చెంబూర్‌కు చెందిన 28 ఏళ్ళ యువకుడిని దొంగ పాస్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది యువకులతో కలిసి […]

ఈయన గారి మోసానికి ఇప్పుడే అవకాశం దొరికింది..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 5:32 PM

కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు జనం. మరో వైపు దేశంలో ఉన్న లాక్‌డౌన్‌ను కూడా క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు అక్రమార్కులు. లాక్‌డౌన్‌లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం అక్రమార్కులు ఫేక్‌ ఈ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబైలోని చెంబూర్‌కు చెందిన 28 ఏళ్ళ యువకుడిని దొంగ పాస్‌ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది యువకులతో కలిసి ఫోర్జరీ ట్రావెల్‌ పాస్‌లను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో పాస్‌కు దాదాపు రూ.5000 లకు పైగా అమ్మకానికి పెట్టారు. ఇది గమనించిన కొందరు దక్షిణ ముంబై ప్రాంతానికి చెందిన డోంగ్రీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా సూత్రదారి మనోజ్‌ రాము హంబేను అరెస్టు చేశారు. నిందితులు దొంగ పాస్‌లను ముంబై, నేవీ ముంబై పోలీసు కమీషనర్లు, ముంబైకి చెందిన పలు కలెక్టర్‌లు జారీ చేసినట్లుగా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.