AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ : రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

తెలంగాణలో  రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది.  జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30 గంటలకు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికలు ప్రారంభించనున్నారు.

తెలంగాణ : రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2020 | 10:24 AM

Share

తెలంగాణలో  రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యింది.  జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30 గంటలకు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్న సీఎం.. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను  ముఖ్యమంత్రి వివరించనున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు.

Also Read : హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ దగ్గర హవాలా సొమ్ము