టీడీపీ మళ్ళీ పుంజుకోవాలి – సుజనా

భారతదేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే.. బీజేపీలో చేరామని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. మాతృ పార్టీ టీడీపీని వదిలినందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. బీజేపీలోకి చేరడం రాజకీయ నిర్ణయమేనని.. తన నిర్ణయం కేసులతో సంబంధం లేదని సుజనా స్పష్టం చేశారు. తాను మూడున్నరేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర పని చేశానని.. మోదీ భారత్ కు సరైన నాయకుడని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తన […]

టీడీపీ మళ్ళీ పుంజుకోవాలి - సుజనా
Follow us

|

Updated on: Jun 20, 2019 | 8:37 PM

భారతదేశానికి, రాష్ట్రానికి మరింత సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే.. బీజేపీలో చేరామని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. మాతృ పార్టీ టీడీపీని వదిలినందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. బీజేపీలోకి చేరడం రాజకీయ నిర్ణయమేనని.. తన నిర్ణయం కేసులతో సంబంధం లేదని సుజనా స్పష్టం చేశారు. తాను మూడున్నరేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర పని చేశానని.. మోదీ భారత్ కు సరైన నాయకుడని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తన రాజకీయ గురువు చంద్రబాబే అని సుజనా ధృవీకరించారు. పార్టీ కోసం తాను ఎంతగా శ్రమించానో చంద్రబాబుకు తెలుసని.. టీడీపీ మళ్ళీ పుంజుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్డీయే వీడి బయటికి రావొద్దని ఆనాడే చంద్రబాబుని హెచ్చరించానని.. అయితే రాజకీయ వ్యూహం అనుకుంటూ చంద్రబాబు తప్పుడు లెక్కలు వేసుకున్నారని సుజనా పేర్కొన్నారు. ఏపీకి ప్యాకేజి అందించడంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని.. తన ఉద్దేశంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని సుజనా చౌదరి స్పష్టం చేశారు.