వర్షాలకు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిందే

తెలంగాణలోని నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 20న గానీ.. ఆ తరువాత గానీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయు తుఫాను వలన ఈ రుతుపవనాల రాక ఆలస్యం అవుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని వారు తెలిపారు. కొన్ని చోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడగాలులు వీచే […]

వర్షాలకు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిందే

Updated on: Jun 17, 2019 | 10:57 AM

తెలంగాణలోని నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 20న గానీ.. ఆ తరువాత గానీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయు తుఫాను వలన ఈ రుతుపవనాల రాక ఆలస్యం అవుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18వరకు ఎండల తీవ్రత కొనసాగనుందని వారు తెలిపారు. కొన్ని చోట్ల 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. అయితే మొదట ఈ నెల 12న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నప్పటికీ.. వాయు తుఫాను వలన ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతోన్న విషయం తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us