Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్ ఏ ఎనర్జీ!..ప్రధాని హుషారుకు బియర్ గ్రిల్స్‌ ఫిదా!

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోదీతో కలిసి డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. షో హోస్ట్‌ బియర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ.. దట్టమైన అడవిలో వణ్యప్రాణుల మధ్య గడిపారు. ప్రకృతిని కొత్త కోణంలో ఆస్వాదించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ అడవిలో షూట్ చేసిన ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ ఛానెల్ ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు ఇంగ్లిష్, తెలుగు సహా […]

వాట్ ఏ ఎనర్జీ!..ప్రధాని హుషారుకు బియర్ గ్రిల్స్‌ ఫిదా!
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 11, 2019 | 3:05 AM

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీలోని వైవిధ్య కోణం ఆవిష్కృతమైంది. మోదీతో కలిసి డిస్కవరీ ఛానెల్ రూపొందించిన ఓ అరుదైన షో దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. షో హోస్ట్‌ బియర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ.. దట్టమైన అడవిలో వణ్యప్రాణుల మధ్య గడిపారు. ప్రకృతిని కొత్త కోణంలో ఆస్వాదించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ జిమ్ కార్బెట్ అడవిలో షూట్ చేసిన ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ ఛానెల్ ఆగస్టు 12 రాత్రి 9 గంటలకు ఇంగ్లిష్, తెలుగు సహా ఐదు భారతీయ భాషల్లో ప్రసారం చేయనుంది. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ టెలివిజన్‌ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు.

‘ ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే ఆయన నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువకుడి మాదిరిగా నాతో పాటు అడవిలో కలియతిరిగారు. ఆయన అంత హుషారుగా, సౌకర్యంగా, నిశ్శబ్దంగా ఉండటం చూసి నాకే ఆశ్చర్యమేసింది. ఈ షోలో భాగంగా మేం కొన్ని రాళ్లను నిజంగానే పగలగొట్టాం. మా బృందం మొత్తం అక్కడ ఉండటానికి భయపడుతుంటే మోదీ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఎలాంటి సంక్షోభాన్నైనా తట్టుకోగలరని నాకు అప్పుడే అర్థమైంది’ అని తెలిపారు.