పద్య ప్రభంజనం కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారంటూ కితాబు

|

Jan 24, 2021 | 2:27 PM

పద్య ప్రభంజనం పేరుతో రూపొందించిన పద్యకవుల కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మెతుకు సీమ రచయితల..

పద్య ప్రభంజనం కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారంటూ కితాబు
Follow us on

పద్య ప్రభంజనం పేరుతో రూపొందించిన పద్యకవుల కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. మెతుకు సీమ రచయితల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవిత, కవుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సంకలనంలో ఆరువందలకు పైగా రచయితలు పాల్గొన్నారు. పుస్తకం చదివిన తర్వాత ఇది ఓ జాతీయ కావ్యంలా అనిపించిందన్నారు కవిత. తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలాంటి సాహిత్య ప్రక్రియ ద్వారా జాతిని ఎలా జాగృతం చేయాలనే అంశంపై దృష్టి పెట్టాలని కూడా ఆమె సూచించారు.