మరోసారి నోటికి పనిచెప్పిన రాజన్న.. పార్టీలో తర్జనభర్జన..?

| Edited By:

Jun 17, 2019 | 11:56 AM

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా..? లేదా పార్టీ మారిన తరువాత అనర్హత పిటిషన్ వేయాలా అన్న దానిపై టీపీసీసీ మదన పడుతోంది. గతంలో కూడా పార్టీపై విమర్శలు చేసి రాజగోపాల్ రెడ్డి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై మరోసారి టీపీసీసీ క్రమశిక్షణా […]

మరోసారి నోటికి పనిచెప్పిన రాజన్న.. పార్టీలో తర్జనభర్జన..?
Follow us on

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల కారణంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా..? లేదా పార్టీ మారిన తరువాత అనర్హత పిటిషన్ వేయాలా అన్న దానిపై టీపీసీసీ మదన పడుతోంది. గతంలో కూడా పార్టీపై విమర్శలు చేసి రాజగోపాల్ రెడ్డి షోకాజ్ నోటీసులు అందుకున్నారు. కాగా, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై మరోసారి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చర్చించనుంది.