పాత సామాను కొంటానని నమ్మించిన ఓ వ్యక్తి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. కేసరపల్లిలోని పంచాయతీ ఆఫీసు దగ్గర్లో మూల్పూరు పద్మావతి అనే వివాహిత జీవనం సాగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మోటార్ వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొంటాను అని చెప్పాడు. అలాంటివేమీ లేవని పద్మావతి బదులు చెప్పింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన ఆ వ్యక్తి ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని అడిగాడు.