హోటల్ బిల్లుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్..

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఈ భామ ‘అశ్వథ్థామ’ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని నిర్మించింది కూడా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్. అయితే తాను స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్మాతల పే చేయలేదంటూ ఇటీవల మీడియాకు లీకులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

హోటల్ బిల్లుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్..
ప్రస్తుతం ఎఫ్3తోపాటు తాను మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో మాత్రమే చేస్తున్నట్లుగా చెప్పింది. 
Follow us

|

Updated on: Feb 24, 2020 | 8:06 PM

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఈ భామ ‘అశ్వథ్థామ’ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నటించింది. చిత్రాన్ని నిర్మించింది కూడా నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్. అయితే తాను స్టే చేసిన హోటల్ బిల్లులను నిర్మాతల పే చేయలేదంటూ ఇటీవల మీడియాకు లీకులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సినిమా కోసం మెహ్రీన్‌కు రూ. 65 లక్షల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట. అందులో రూ. 55 లక్షలు సినిమాకు ముందే ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మిగతా రూ. 10 లక్షల సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని నిర్మాణ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా సినిమా కంప్లీట్ అయ్యాక ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రమోషన్స్‌కు యగనామం పెట్టిందట హీరోయిన్. దీంతో ప్రొడ్యూసర్స్ హోటల్ కోసం, ఇతరత్రా ఖర్చులు కోసం ఇంత ఖర్చు చేస్తుంటే..ప్రయోషన్స్‌కి రాకపోతే ఎలా అని కాస్త ఫైరయ్యారట. అలా అనగానే అలిగిన మెహ్రీన్ చెప్పా పెట్టకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందట. ఇక చేసేది లేక అప్పటివరకు అయిన బిల్లులను ఐరా క్రియేషన్స్ పే చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ కూడా ధృవీకరించారు. అయితే ముందుగా తనకు బ్యాడ్ నేమ్ రాకూడదన్న నేపథ్యంలో మెహ్రీన్ ఈ తరహా లీకులకు పాల్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన మెహ్రీన్ :

“నా సంక్రాంతి విడుదల ప్రమోషన్లను ముగించిన తరువాత, నేను పంజాబ్‌లోని నా కుటుంబాన్ని చూడటానికి వెళ్ళాను. చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందు నేను ప్రమోషనల్ వర్క్ చేయడానికి హైదరాబాద్ తిరిగి వచ్చాను. మా తాతగారికి గుండెపోటు రావడం వల్ల నేను హైదరాబాద్ వచ్చేందుకు కొంత సమయం ఆలస్యమైంది. ఈ విషయాన్ని నా సహనటుడు నాగ శౌర్య ఇంటర్వ్యూల సందర్భంగా కూడా ప్రస్తావించారు. తిరిగి వచ్చిన తర్వాత నేను అశ్వథామ కోసం అన్ని ప్రమోషన్లలో పాల్గొన్నాను.  నాకు స్కిన్ అలెర్జీ వచ్చి..ముఖం దద్దుర్లు రావడంతో ఒక  ఒక ఇంటర్వ్యూలో పాల్గొనలేకపోయాను. అందుకు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫోటోను నిర్మాతలకు పంపి..క్షమాపణ కోరాను. అయినా కూడా  నిర్మాతలు నా హోటల్ బిల్లును కట్టడానికి నిరాకరించారు. నా సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించలేదు. నేను కోరిన తర్వాత ఆ హోటల్ బిల్లులు పే చేసి…సిబ్బందికి డబ్బులు ఇచ్చారు.  కాని ప్రస్తుతం సర్కులేట్ అవుతోన్న వార్తలు నన్ను చాలా బాధకు గురిచేశాయి. నేను ఇప్పటివరకు  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 14 చిత్రాలలో పనిచేశాను. కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమా కోసం వాటన్నింటిని దాటి వచ్చాను. ఇప్పటివరకు పనిచేసిన ఏ సంస్థతో కూడా నాకు ఫైనాన్సియల్ డిఫరెన్సెస్ లేవు. కొన్ని ఆర్టికల్స్‌లో నా హోటల్ బిల్లులు, ఆహారం, లాండ్రీ బిల్లులు ప్రస్తావించం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా, నా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ పారితోషికంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది నేరుగా ప్రొడక్షన్ హౌస్‌తో జరుగుతుంది. ప్రతి కాయన్‌కి రెండు వైపులు ఉంటాయి. నాకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని కించపరుస్తున్నప్పుడు..సైలెంట్‌గా ఉండలేను. అశ్వథామ చిత్రంలో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐరా క్రియేషన్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి భవిష్యత్ ప్రయత్నాలు సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఇకపై ఈ విషయం గురించి నేను ప్రస్తావించాలనుకోవడం లేదు” అని మెహ్రీన్ సోషల్ మీడియాలో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?