మే 23న ఇక “మోదీ దివస్”

| Edited By:

May 28, 2019 | 12:39 PM

సార్వత్రిక ఎన్నికల్లో కమల దళం భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అయితే ఈ రోజును మోదీ దివస్‌గా జరుపుకోవాలని రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కోట్లాది మంది ప్రజల నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిచారని కొనియాడారు. ఓ వైపు మహాకూటమి, ఇంకో వైపు మోదీ ఒక్కడని.. అయినా ఈ ఎన్నికల్లో పోరాడి యూపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారని […]

మే 23న ఇక మోదీ దివస్
Baba Ramdev
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో కమల దళం భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అయితే ఈ రోజును మోదీ దివస్‌గా జరుపుకోవాలని రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కోట్లాది మంది ప్రజల నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిచారని కొనియాడారు. ఓ వైపు మహాకూటమి, ఇంకో వైపు మోదీ ఒక్కడని.. అయినా ఈ ఎన్నికల్లో పోరాడి యూపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారని రాందేవ్ అన్నారు. ప్రజలందరూ ప్రస్తుతం మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ అఖండ విజయాన్ని సాధించిన మే23ని మోదీ దివస్ లేదంటే లోక కల్యాణ్ దివస్‌గా జరపాలని కోరారు.